చాలా మందికి గుర్తుండే ఉంటుంది… చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, ప్రపంచ చరిత్రని రెండు భాగాలుగా చెప్పేవారు.. క్రీస్తు పూర్వం ( B C ), క్రీస్తు తరువాత ( A D ) అని… అలాగే ఈ సంవత్సరం అంటే 2020 నుండీ.. కరోనా పూర్వం ( B C ) , కరోనా తరువాత ( A C ) అని చెప్పుకోవాలనుకుంటా, భవిష్యత్తు లో…
కలలో కూడా ఊహించుండము.. ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని ఒక్కసారి కుదిపేసి, అతలాకుతలం చేసేస్తుందని.. మన అనుకోడాలతో నిమిత్తం లేకుండా తన పనేదో చేసుకుపోయిందీ.. పోతోందీ ..కూడా.. ఇంకా vaccine రాకపోయినా,ఈ వైరస్ spread అవకుండా, అదేదో Social distancing పాటిస్తే చాలన్నారు.. ఊరికే బయట తిరిగితే అలాటివి సాధ్యపడవని ఇప్పటికి మూడు సార్లు Lock Down చేసేసారు.. నాలుగోది జరుగుతోంది.. జూన్ 1 వ తేదీనుండి, ఏమౌతుందో తెలియదింకా..అదీ ప్రస్తుత పరిస్థితి..
ఈ lock down ధర్మమా అని ఓ విషయం తేలిపోయింది.. ఇన్నిసంవత్సరాలూ ఫలానాది లేకపోతే అసలు బతగ్గలమా అన్నది ఓ “ భ్రమ”.. ఈ రెండు నెలలూ బతకలేదూ ?.. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఒకానొకప్పుడు అంటే సంపాదన అంతగా లేనప్పుడు, ఏవైతే మనం లగ్జరీలు గా భావించి, వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదో, వాటినే డబ్బులు చేతుల్లో పుష్కలంగా ఆడేసరికి , అవసరాలుగా మార్చేసి, వాటినే 21 వ శతాబ్దానికి “ అత్యవసరాలు “ గా మార్చేసి, మన పిల్లలని కూడా అదే మార్గంలో పెంచుతున్నాము.. పోనీ, నాలాటి ఏ తలమాసినవాడో , సలహా ఇద్దామని చూసినా, వినేవాడుండకపోగా, నాలాటివాడిని కూడా, అవసరంలేని లగ్జరీలకి అలవాటు చేసేసారు.. మొత్తానికి ఈ రెండునెలల్లోనూ తెలుసుకున్నదేమిటంటే, ఈ కొత్తగా తెచ్చుకున్న అలవాట్లు , అందుబాటులో లేకపోయినా , హాయిగా బతికేయొచ్చని..
మా చిన్నప్పుడు చూసేవాళ్ళం.. బయటనుండి ఎవరైనా ఇంటికి వస్తే, ఆ కాంపౌండు లోనే ఉండే నూతిలోంచో, తరవాత్తరవాత కుళాయిలకిందో కాళ్ళు కడుక్కుని కానీ, లోపలకు వచ్చేవారు కాదు.. అంతకు పూర్వపురోజుల్లో, ఓ గోలెం నిండా నీళ్ళూ, అందుబాటులో ఓ చెంబూ ఉండేవి.. పసిపిల్లల్ని , ఎత్తుకోవాలంటే, కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కోవడమనేది కంపల్సరీగా ఉండేది..కానీ ఈ ఎపార్ట్మెంట్లు వచ్చాక, గోలాలూ లేవూ, నూతులూ లేవూ.. అదృష్టం బావుంటే, చెప్పులో, బూట్లో విప్పుకుని వస్తారు.. లేదా అలాగే వచ్చేసినా ఆశ్చర్యం లేదు..ఇంట్లో వాడుకోడానికి “ మడి “ చెప్పులైతే ఎప్పుడో వచ్చేసాయి…
ఈ కరోనాకి పూర్వం, నగరాల్లోనూ, పెద్ద పట్టణాలలోనూ గమనించిందేమిటంటే, చాలా మందికి అంటే కనీసం నూటికి యాభై మందికి , ఇంట్లో రోజూ తినే తిండికంటే, కనీసం వారంలో రెండు మూడుసార్లైనా,జొమాటో, స్విగ్గీ ల ద్వారా బయట నుండి తెప్పించుకోవడమో, కాకపోతే ఏదో హొటల్ కి వెళ్ళి భోజనం చేస్తే కానీ, భోజనం చేసినట్టనిపించేది కాదు..ఈ రెండునెలలూ, నచ్చినా నచ్చకపోయినా, ఇంటి తిండి లో ఉండే ఘనత తెలిసే ఉంటుంది..ఈ Lock Down తరవాత హొటళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలియదు, అధవా తెరిచినా, అక్కడ తింటే ఏం ప్రాణం మీదకొస్తుందో అనే భయం.. అలాగే వీకెండ్స్ వచ్చేసరికి, ఔటింగ్ పేరు చెప్పి, ఊళ్ళో ఉండే ఏ పేద్ద mall కో వెళ్ళడం, అక్కడ ఉండే multiplex లో సినిమా చూసేసి, అక్కడే ఉండే food court లో తిండి తినేయడం… అలాగే పెళ్ళికానివారు , అవేవో pub లకి వెళ్ళడం… అవన్నీ తప్పనడం లేదు.. ఆధునిక యుగంలో survive అవడానికి ఇవన్నీ తప్పవంటారు.. ఏమో..ఇవన్నీ తెరిచేటప్పటికి ఎంత టైము పడుతుందో తెలియదాయె..
మరో విషయం.. పూర్వకాలంలో so called అగ్రకులాలవారు, కొంతమందిని దూరంగా పెట్టేవారనీ, అలాగే మడి ఆచారాల పేరుతో, అస్సలు దగ్గరకే రానిచ్చేవారు కాదనీ.. ఏవేవో చెప్పేవారు.. ఏమో కొన్ని యుగాలక్రితం ఇప్పుడొచ్చిన కరోనా లాటి మహమ్మారి కానీ వచ్చిందేమో, దాని మూలంగానే ఇప్పుడున్న social distance లాటిది పాటించారేమో, ఆ concept/practice నే కొనసాగించారేమో, ఎవరికి తెలుసూ? పైగా ఇలాటివాటివి తెలుసుకుని నిజానిజాలు తెలిస్తే, ఏమో రాజ్యాంగ సవరణలు చేయాలేమో.. అందుకనే sensitive విషయాలు తెరమరుగున ఉంటేనే దేశ నాయకులకి ఆరోగ్యకరమేమో…
సశేషం…