ఈ కరోనా వ్యవహారంలో అన్నీ గందరగోళాలే..ఉదాహరణకి టీకాల వ్యవహారమే తీసుకోండి.. కొన్ని రాష్ట్రాల్లో , మార్చ్ 1 నుండి, 60+ వారికి అందరికీ ఈ టీకాల కార్యక్రమం తెరిచారు.. కొన్నిచోట్ల ధర్మాసుపత్రుల్లో ఉచితంగానూ, మిగిలిన ఆసుపత్రుల్లో డొసు కి 250 చొప్పునా వసూలు చేస్తున్నారు.. రెండు రకాల వాక్సీన్లు రంగంలోకి దింపారు.. వాటి మంచీ చెడుల గురించి, మీడియాలో కొట్టుకు ఛస్తున్నారు అది వేరేసంగతనుకోండి..ఏదో లోకాన్ని ఉధ్ధరించేద్దామని కాకపోయినా,’నలుగురితోపాటూ నారాయణ’ అనుకుంటూ, మొత్తానికి సీనియర్ సిటిజెన్లు చాలామంది “సూదిమందు” తీసుకున్నారు, చాలామంది, ప్రధానమంత్రిగారు ఫొటో పెట్టుకున్నారుకదా అని వాళ్ళూ పెట్టుకున్నారు..ఎంతైనా అదో స్టేటస్ సింబలాయే.. పైగా , మిగిలినవాళ్ళకి ధైర్యం చెప్పడానికి మాత్రమే పెట్టుకున్నామని ఓ సమర్ధింపోటీ.. పోనిద్దురూ ఎవరిష్టం వాళ్ళది వదిలేద్దాం..
ఈ ‘వరిష్ఠ నాగరిక్ ( సీనియర్ సిటిజెన్ కి మరాఠి పదం)’ లలో కొంతమంది ప్రముఖుల ఫొటోలు కనిపించడం లేదేమిటో మరి.. దేశంలో ఏ గొప్ప సంఘటన జరిగినా… “అసలు నేనే చెప్పానూ అలా చేయమనీ..’ అనే ప్రకటనొచ్చేసేది ఈ పెద్దాయన పేరు మీద.. ఎక్కడదాకా అంటే, ఏ రంగంలోనైనా విజయం సాధించిన తెలుగువారందరికీ ఈయనే మార్గదర్శనం చేయించినంతగా…మరి ఈ వాక్సినేషన్ల విషయంలో అస్సలు నోరెత్తకపోవడం ఆశ్చర్యంగా ఉంది.. ఇలాటి సదవకాశం ఎలా వదిలేసారో?
మొదట్లో రెండు వాక్సీన్లు—ఒకటి హైదరాబాదులోనూ, మరోటి పుణె లోనూ తయారయినవి మొదలెట్టారు.. రెండిటికీ పూర్తి పరీక్షలు జరగలేదని ఓ వైపు ఒప్పుకుంటూనే, అయినా పరవాలేదూ అంటున్నారు.. నిజమే కదా, పోతే ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వాలా ఏమిటీ? ఏదో Act of God అని వదిలేస్తే సరి.. 1 వ తారీకున ప్రారంభమయాక, 28 రోజులకి రెండో “ డోస్” వేసుకోవాలిట..ఇంకో వారం ఉంది..ఈలోపులో మళ్ళీ మరో తంటా రంగంలోకి దింపారు..పుణె లో తయారయిన వాక్సీన్ సరఫరా తగ్గిపోయిందిట.. కారణం—‘ ముడిసరుకు’ అమెరికాలో ఇవ్వడంలేదని, వార్తలు..మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్ కోసం ఎదురుచూస్తూన్న జనాలకి రెండో డోస్ దొరుకుతుందో లేదో అంతా అగమ్యగోచరం..ఏప్రిల్ నెలవచ్చేసరికి, రెండో డోస్ దొరక్కపోవడం మూలాన, తీసుకోలేకపోయిన జనాలు ఎంతమంది మిగులుతారో ఆ భగవంతుడికే తెలియాలి..ఈలోపులో మన తెలుగురాష్ట్రాల్లో మరో పబ్లిసిటీ స్టంటు మొదలయింది.. నిన్ననే side effects ఉండవుట కదా మన హైదరాబాదీ వాక్సీన్ కీ..తీసుకున్నామూ.. అంటూ పోస్టులూ ఫొటోలూ..అంటే ఓ “ బడుధ్ధాయిలూ.. మీ పుణే వాక్సీన్ అంత safe కాదుట అని indirect గా చెప్పడమేకదా..” ఏమో ఇదికూడా రాజకీయమేమో..
ఈ హడావిడిలా ఉండగా.. “ హైదరాబాదు “శాంతా బయో” అధినేత శ్రీ వరప్రసాదరెడ్డిగారి below the belt interview చూడండి.. ఎంత స్పష్టంగా చెప్పారో ఆయన..
ఆయనేమీ ఆషామాషీ మనిషేమీ కాదాయె.. ఎంతో ఆలోచించికానీ, మాట్టాడే మనిషికూడా కాదూ.. అసలు ఈ వాక్సినేషన్ల వెనుక “భాగోతం” ఏమిటో?
మొన్న 6 వ తారీకున నేనూ, మా ఇంటావిడా మా పుణెలో తయారయిన COVISHIELD మందే పొడిపించుకున్నాము, 28 రోజుల తరవాత రెండో డోసు దొరుకుతుందో లేదో ఆ భగవంతుడే చెప్పాలి.. ఇంకా భూమ్మీద నూకలుంటే ఉంటాం.. లే…దా